తెలంగాణ మంత్రులు దద్దమ్మలు: కేకే హైదరాబాద్: తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వనని సీమాంధ్ర సీఎం కిరణ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా స్పందించని దద్దమ్మలు తెలంగాణ మంత్రులు అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ఇవాళ ఆయన అంబేద్కర్ కాలేజీలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడారు. హైదరాబాద్లో అన్ని వ్యాపారాలు సీమాంధ్రుల చేతుల్లో కేంద్రీకృతమైనాయని ఆరోపించారు. షాపింగ్ మాల్స్, అపార్ట్ంట్లు అన్ని సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమైనాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము విడిపోతామన్నా కలిసుండాలని సీమాంధ్రులు పట్టుబట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తెలంగాణ కోసం వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే దానిపై పార్లమెంట్ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
Posted on: Tue, 17 Sep 2013 09:55:33 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015