తెలంగాణవాదులపై విజయలక్ష్మీ సిబ్బందిదాడి హైదరాబాద్ : ఉప్పల్ ఆర్టీసీ బస్ డిపో వద్ద వైఎస్ విజయలక్ష్మీని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న విజయలక్ష్మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తెలంగాణవాదులపై విచక్షణా రహితంగా దాడి చేసింది. దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు కూడా తెలంగాణవాదులపై లాఠీలు ఝులిపించారు. తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Posted on: Fri, 28 Jun 2013 07:39:40 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015